తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 మరికొన్ని రోజుల్లో ముగిసి పోతుంది. ఇంటి సభ్యుల మద్య తీవ్రస్థాయిలో పోటీ మొదలైంది. మొన్నటి ఆదివారం మహేష్ విట్టా ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇక ఇంట్లో మిగిలింది ఏడుగురు మాత్రమే..దాంతో ఎవరికి వారే తమ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. చివరి వారం మాత్రం ఫైనల్లో కేవలం ఐదుగురు మాత్రమే హౌస్లో ఉంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో బిగ్బాస్ ఛాంపియన్ కావాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతే కాదు బిగ్ బాస్ లో పాల్గొని ఎలిమినేషన్ అయిన వారు సైతం పలనా వాళ్లకు ఓటు వేయండీ అంటూ ప్రేక్షకులను కోరుతూ వారికి మద్దతు ఇస్తున్నారను. బిగ్ బాస్ 2 లో కౌశల్ కి ఒక ఆర్మీ ఏర్పడిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు కౌశల్ ఆర్మీ గేమ్ ఆడిందని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.
కౌశల్ ఆర్మీ ఓటింగ్ తోనే ఇంటి సభ్యులు వెళ్లిపోయారని రూమర్లు కూడా వచ్చాయి. బిగ్ బాస్ 2 లో కొంది మందికి బ్యానర్లు కట్టిమరీ ఓటింగ్ వేయాలని ప్రచారాలు చేశారు. తాజాగా ఇప్పుడు ఏకంగా థియేటర్లో బిగ్ బాస్ 3 ఇంటి సభ్యురాలికి ఓటింగ్ వేయాలని చూసి అంతా షాక్ తిన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరిలోకి అత్యధిక ఫాలోయింగ్ ఉన్నది యాంకర్ శ్రీముఖికే.
ఆమె అభిమానులు ఇప్పుడు శ్రీముఖి ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. శ్రీముఖి గెలిపించమని ఏకంగా థియేటర్స్ లో యాడ్స్ వేయడం విశేషం. ‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ ఫోన్ నంబర్ తో సహా ఈ ప్రకటన ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తోంది. మరోవైపు ఆమె కోసం డబ్బులు ఖర్చు చేస్తే వేస్ట్ అని విమర్శలు కూడా వస్తున్నాయి.