స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల .. వైకుంఠపురములో.. ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. ఇక ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన 'సామజవరగమన' సాంగ్ యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుని యూ ట్యూబ్ లో 43మిలియన్ల పై చిలుకు వ్యూస్ తో సాంగ్ అఫ్ ది ఇయర్ అనిపించుకుంది. అంతేకాదు ఇప్పటివరకు అత్యధిక లైక్స్ ను రాబట్టుకున్న తెలుగు సాంగ్ కూడా ఇదే కావడం విశేషం.
ఇక తాజాగా ఈ చిత్రం నుండి రెండో సాంగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. రేపు సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమాలోని 'రాములో రాముల' అనే సెలెబ్రేషన్ సాంగ్ ప్రోమో ను విడుదలచేయనున్నారు. ఫుల్ సాంగ్ మాత్రం దీపావళి రోజు రిలీజ్ కానుంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్ , స్టిల్స్ సినిమా పై భారీ అంచనాలను తీసుకొచ్చాయి.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురేజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్,రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరికలయికలో వచ్చిన జలాయి , సన్అఫ్ సత్యమూర్తి సినిమాలు విజయాలను సాధించాయి.