అత్తారింటి దారేది సినిమా పై అవార్డు జ్యూరీ సభ్యుల సంచలన కామెంట్ !

Seetha Sailaja
క్రితం సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్మాణం అయిన ఉత్తమ చిత్రాలకు ప్రభుత్వం అందించే అవార్డులు వెల్లడి అయ్యాయి. మన తెలుగు సినిమాకు సంబంధించి అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నా బంగారు తల్లి చిత్రం అవార్డు గెలుచుకున్న విషయం తెలిసి ఆ సినిమా ఎప్పుడు విడుదలైంది అని చాలామంది ఆశ్చర్యపోయారు.  అయితే గత సంవత్సరం విడుదలై తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన పవన్ ‘అత్తారిల్లు’ సినిమా ఉత్తమ కుటుంబ కధా చిత్రం కేటగిరిలో ఆ సినిమాకు ఏమైనా అవార్డులు వస్తాయేమోనని పవన్ అభిమానులే కాకుండా ఈ సినిమా యూనిట్ వారు కూడ ఆశించారు. అవార్డుల ప్రకటనకు ముందు నేషనల్ జ్యూరీ సభ్యుల పై అత్తారిల్లు సినిమాగురించి అవార్డుల విషయమై కొంత లాబియింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను చుసిన బెంగాల్, కేరళా కు చెందిన కొంతమంది జ్యూరీ సభ్యులు ఇదేమి సినిమా అంటు కామెంట్ చేయడమే కాకుండా 1980 ప్రాంతం నాటి సినిమాగా ఈ సినిమా కధ ఉంది అంటు కామెంట్ చేయడమే కాకుండా ఈ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ ఎలా అయింది అని ఆశ్చర్యం వ్యక్త పరిచారట. ఈ కామెంట్స్ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు తెలిస్తే గట్టి షాక్ తింటాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: