తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. బోయపాటి దర్శకత్వం అంటే యాక్షన్, సెంటిమెంట్ కలగలిపి ఉంటుందని అందరికీ తెలుసు అలాంటి పవర్ ఫుల్ పాత్రలో బన్ని నటించబోతున్నాడట. మంచి హీరోయిజం ఉంటూ ప్యూర్ లవ్ స్టోరీ మిక్స్ అయిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారమ్.
ఇద్దరమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్, కేథరిన్
అల్లు అర్జున్ ని అభిమానులు, సినీ ప్రియులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి క్యారక్టరైజేషన్ తో ఈ సినిమా ఉంటుందట. ఈ చిత్రానికి ‘రథం’ టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఇప్పటికే సినిమాల హీరోయిన్ గా రకూల్ ప్రితిసింగ్ చాన్స్ కొట్టేసింది, అయితే మరోహీరోయిన్ కూడా ఉంటుందట దీనికోసం ఇప్పటికే బన్ని సరసన ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో నటించిన కేథరిన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ చిత్రంలో మరోసారి బన్ని ఇద్దరు హీరోయిన్లతో చిందేయబోతున్నడన్నమాట. మొత్తానికి రెండో సారి చాన్స్ కొట్టేయ బోతున్న కేథరిన్ మటుకు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది.