పెళ్లి చేసుకుని.. పట్టించుకోవడం మానేశాడు...!!
చాంద్దీప్కి పంజాబ్కి చెందిన రమణ్దీప్తో 2015లో వివాహం జరిగింది. రమణ్దీప్ న్యూజిలాండ్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. పెళ్లయ్యాక న్యూజిలాండ్ వెళ్లిన రమణ్దీప్ భార్య చాంద్దీప్తో మాట్లాడడం మానేశాడు. దాంతో చాంద్దీప్ 2016లో భర్తపై పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు రమణ్దీప్ భారత్కు రాకపోవడంతో త్వరగా న్యూజిలాండ్ నుంచి తన భర్తను రప్పించాలని.. అతనికి విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నానని చాంద్దీప్ కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్కు తన కథంతా ట్విట్టర్ ద్వారా వివరించింది. దీనిపై స్పందించిన సుష్మాస్వరాజ్.. కేసుకు సంబంధించిన పత్రాలను తనకు మెయిల్ చేయాలని సూచించారు. ఈ కేసులో ఇప్పటికే పంజాబ్ పోలీసులు రమణ్దీప్పై పీవో జారీచేశారు.