"20 కోట్లు" ఇచ్చి "భారతీయులని" కాపాడాడు "ఈ సింగ్"

Bhavannarayana Nch

విదేశాలలో  ఎంతో మంది భారతీయులు నేరాలు చేసి జైలుకు వెళ్తూ ఉంటారు..కొంతమంది అనుకోకుండా జిల్లాలో మగ్గుతుంటే మరికొందరు క్షణికావేసంతో జైళ్ళ పాలవుతున్నారు..మరెంతో మంది ఉరికంబాలు ఎక్కి ప్రాణాలు విడుస్తున్నారు..అయితే ఈ తరహాలోనే సుమారు 15 భారతీయులకి పడిన ఉరి శిక్ష అమలు చేయనున్నారు అయితే ఇక్కడే ఒక భారతీయ పంజాబ్ ఎన్నారై సింగ్ ఆ 15 మందిని కాపాడాడు..వివరాలలోకి వెళ్తే..  


దుబాయ్‌లో ఓ బడా హోటల్‌ నిర్వాహకుడైన ఎస్పీ సింగ్‌ ఒబెరాయ్‌ ఎంతో మానవత్వం కలిగిన వకటిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు....ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 మందిని ఉరికొయ్యలు ఎక్కకుండా కాపాడాడు.. ఆ సింగ్ పేరు  ఒబెరాయ్‌..ఆయన దుబాయ్ లో ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ నడుపుతున్నాడు..అక్రమ సారా దందా, హత్యలకు సంబంధించి రెండు వేర్వేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరికి అక్కడి కోర్టులు మరణశిక్ష విధించాయి.

 

అయితే వీరు ఆరోపణలు ఎదుర్కుంటున్న భాదితుల కుటుంభాలకి నష్ట పరిహారం దాదాపు 20 కోట్ల రూపాయలు చెల్లించారు..ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 14 మంది ఇప్పటికే స్వదేశానికి వచ్చేశారు...మిగిలిన ఒకే ఒక్క వ్యక్తి భారత్  కి తిరిగి ఆ ఒక్క వ్యక్తి కూడా ఒకట్రెండు రోజులో భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు దుబాయ్‌ జైళ్లలో మగ్గుతున్న 93 మందిని ఎస్పీ సింగ్‌ విడిపించారు. ఇందుకుగాను బాధితుల కుటుంబాలకు ఆయన రూ.20 కోట్ల దాకా చెల్లించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: