అమెరికాలో "భారతీయుడి" ఘనత..వరించిన..."గ్లోబల్ లీడర్ షిప్"

NCR

అమెరికాలో భారత సతతికి చెందిన గూగుల్ సీఈవో సుదర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది. టెక్నాలజీ అభివృద్ధి రంగంలో సుదర్ పిచాయ్ చేసిన విప్లవాత్మకమైన మార్పులు, సేవలకి గాను పిచాయ్ ని ఈ అవార్డు వరించింది. అమెరికా భారత్ వాణిజ్య మండలి ప్రతీ ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ కి పిచాయ్ ని ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది.

 

పిచాయ్ తో పాటుగా, నాస్‌డాక్‌ ప్రెసిడెంట్‌ అడెనా ఫ్రైడ్‌మాన్‌ పేరుని కూడా ఈ సంస్థ ప్రకటించింది. వీరు ఇద్దరి నేతృత్వంలోని వారు పని చేస్తున్న కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగలో ఉత్తమమైన వారధిని ఏర్పాటు చేయడంలో తమ వంతు కీలక పాత్రలని పోషించినట్లుగా తెలిపింది.

 

ఈ రెండు సంస్థల కారణంగా భారత్ అమెరికా మధ్య వస్తు, సేవల వాణిజ్యం జరిగిన ఐదేళ్ళలో 150 శాతం పెరిగిందని గత ఏడాదికి 142.1 బిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపింది.ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్‌ సదస్సులో వీరికి ఈ అవార్డ్ లు ఇవ్వనున్నట్లుగా అమెరికా భారత్ వాణిజ్య మండలి ప్రకటించింది  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: