అవినీతిలో చైనా పీక్స్.. ఆ అధికారి ఇంట్లో 13500 కిలోల బంగారం
ఓ మాజీ మేయర్ను టార్గెట్ చేసి ఆయన నివాసాలపై నేషనల్ సూపర్వైజరీ కమిషన్ అధికారులు దాడులు చేశారు.. కళ్లు చెదిరే మొత్తంలో ఆస్తులు, బంగారం బయటపడ్డాయి ఆ దాడులలో. బంగారం అంటే మన దగ్గర దొరికినట్టు కిలోల చొప్పున కాదు.. టన్నుల్లో బంగారం దొరికింది. హైకౌ నగర మాజీ మేయర్ అయిన 58 ఏళ్ల ఝాంగ్ కి ఇంట్లో 13.5 టన్నుల బంగారం దొరికింది. బిస్కెట్ల రూపంలో పసిడి గుట్టలు గుట్టలుగా ఉండడం గుర్తించి అధికారులు అక్షర్యా పోయారు. ఆ బంగారం విలువే అక్షరాలా రూ.4,500 కోట్లు కావడం చాలా గమనార్హం.
ఇక ఝాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే 90 లక్షల జనాభా ఉన్న హైనియన్ ప్రావిన్స్ రాజధాని హైకౌలో కమ్యూనిస్టు పార్టీ కమిటీ సెక్రటరీగా ఝాంగ్ ఉన్నారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన పదవి మేయర్కు సమానం. గతంలో హైనియన్ ప్రావిన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గానూ ఆయన పని చేశారు. సదరు నేత అవినీతికి పాల్పడ్డాడని అధికారికంగా తెలిస్తే మాత్రం ఆయనకు మరణశిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.