ట్రంప్ పై బిడెన్ “కమలాస్త్రం” ఎంపిక అందుకే జరిగిందా..!!

VIKRAM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ఎంతో ఆసక్తిగా ఉంటాయి. అందులోనూ ఈ సారి జరగబోతున్న అధ్యక్ష ఎన్నికలను మాత్రం ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి మరీ చూస్తోంది. ట్రంప్ అధ్యక్షుగా ఎన్నికవుతాడా లేక బిడెన్ అధ్యక్షుడిగా ఈ సారి గెలుపొందుతాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా రావడం, నల్లజాతీయులపై జాత్యహంకార దాడులు జరగడం వగైరా వగైరా అన్నీ ట్రంప్ కి ప్రతికూలంగా మారిపోయాయి. సర్వేలు సైతం ట్రంప్ కి వ్యతిరేకంగా మారడంతో ఇక బిడెన్ గెలుపు ఖయామని అందరూ భావిస్తున్నారు..కానీ ట్రంప్ తాజాగా వీసాల విషయంలో అలాగే అమెరికన్స్ కే ఉద్యోగాలు అంటూ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారట..దాంతో అలెర్ట్ అయిన బిడెన్ అనూహ్యంగా కమలా హారీస్ ని ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించి రంగంలోకి దింపాడు..

కమలా హారీస్ ఎంపిక ఎందుకంటే

అమెరికా ఉక్కు మహిళగా పేరొందిన కమలా హారీస్ మాట్లాడటంలో దిట్ట. ప్రత్యర్ధిని మాటలతోనే మట్టి కరిపించడంలో ఆమెకి సాటి మరెవరూ లేరనే చెప్పాలి. బిడెన్ తో పాటు అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేసిన కమలానే ఉపాధ్యక్ష అభ్యర్ధిగా బిడెన్ ఎంపిక చేయడంతో ఆమె ప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కమలా హారీస్ ని బిడెన్ ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడానికి కారణం లేకపోలేదు. నల్లజాతీయురాలుగా, భారతీయ హిందూ మహిళగా ఉన్న కమలా హారీస్ కి  ప్రవాస భారతీయులు , అలాగే నల్లజాతీయుల ఓట్లు  గంపగుత్తంగా పడతాయని చెప్పడంలో సందేహం లేదు  ఎందుకంటే. ట్రంప్ విదేశీయుల వీసాలు, ఉద్యోగాలు, విద్యార్ధుల  విషయంలో అమెరికన్స్ కి లాభాలు చేకూరేలా వ్యవహరించడంతో ఎక్కువ శాతం నష్టపోతున్నది భారతీయులే అలాగే జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో అమెరికాలో ఎన్నడూ లేనంతగా నిరసనలు వెల్లువెత్తాయి. నల్లజాతీయులు అందరూ ట్రంప్ కి వ్యతిరేకంగా మారిపోయారు. ఇదే సమయంలో ఓబమా సైతం కమల హరీస్ ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన చేయడం, అలాగే భారతీయ సంఘాలు సైతం కమలా హరీస్ ఎంపికపై హర్షం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల ఓట్లు బిడెన్ కొల్లగొట్లినట్లే అంటున్నారు పరిశీలకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: