రూమ్ నుంచి కుళ్ళిన కంపు.. తలుపుల బద్దలుకొట్టి చూస్తే?
ఒంటరి జీవితం గడుపుతున్న ఓ పెద్దావిడ అస్తిపంజరం గా మారిపోయింది. లండన్లోని పిచ కమ్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సెయింట్ మేరీస్ రోడ్డులో ఓ మూడు అంతస్తుల భవనంలో 62 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ ఒంటరిగా ఉంటుంది. గత రెండేళ్ల నుంచి ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూసే ఉంది. ఇంటి డోర్ కి అడ్డంగా సైకిల్ కూడా పెట్టి ఉంది. దీంతో ఆ వృద్ధురాలు ఎక్కడికో వెళ్లిపోయింది అనుకున్నారు అందరు. రెండేళ్లుగా ఆ పోర్షన్ నుంచి దుర్వాసన వస్తుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవలే వాసనా మరింత ఎక్కువ అవడంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది ఓ యువతి. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా పెద్దావిడ అస్తిపంజరం కూర్చున్న స్థితిలో కనిపించింది.
దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు ఆ గదిలో కుప్పలు కుప్పలుగా లెటర్ లు కూడా పడి ఉన్నాయి. అయితే ఈ పెద్దావిడ ఎవరు అనే విషయం మాత్రం చుట్టుపక్కల ఎవరికీ తెలియదట. 2019 అక్టోబర్ లో చివరి సారి ఆమెను చూశా అంటూ పొరుగింట్లో ఉండే ఓ యువతి చెబుతోంది. కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.. వృద్ధురాలు కూడా అలాగే వెళ్లిపోయి ఉంటుందని భావించాను అంటూ పోలీసులకు తెలిపింది యువతి. ఈ క్రమంలోనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ వృద్ధురాలు ఎవరు అన్న దానిపై ఆరా తీయడం మొదలు పెట్టారు.