పెళ్లికి వెళ్తున్నారు.. అంతలో పిడుగు పడింది.. చివరికి?

praveen
పెళ్లి అనేది నూరేళ్లపంట అని అంటూ ఉంటారు. ఏ మతంలో అయినా ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఇక దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన వారు కలకాలం సుఖసంతోషాలతో జీవించాలని కోరికతోనే పెళ్లికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని ఇక జీవితాన్ని ఒక ఆస్వాదించాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే పెళ్లి అంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంధుమిత్రులందరూ కూడా వివాహానికి హాజరై నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటారు.


 ఇలా ఎక్కడ లేనంత ఆనందం అటు బంధువుల ముఖాల్లో.. వధూవరుల చిరునవ్వులో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా పెళ్లి వేడుక ఎక్కడ చూసినా ఆనందంగానే ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లి 17 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది.. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది.. అనుకోని ఘటన ఏకంగా 17 మందిని మృత్యువు ఒడిలోకి నెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతున్న బంధువులను వర్షం అడ్డుకోవాలని ప్రయత్నించింది. కానీ వారు అలాగేముందుకు వెళ్లడంతో పిడుగు రూపంలో చివరికి ప్రాణాలు తీసేసింది.


 బంగ్లాదేశ్ లోని షిబ్ గంజ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. షిబ్ గంజ్ నగరం నుంచి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో ఏం జరుగుతుందో అని అందరూ భయపడుతూనే ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు అని చెప్పాలి. ఇలా గాయపడ్డ వారిలో వరుడు కూడా ఉన్నాడు అన్నది తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ లో అడవులు ఎక్కువగా ఉండటం వల్లే పిడుగులు ఎక్కువగా పడుతున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా పిడుగుపాటుతో పెళ్ళంట విషాదం నెలకొంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: