భారతీయుడు.. అమెరికా ప్రెసిడెంట్‌ కాబోతున్నాడా?

Chakravarthi Kalyan
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంపు బదులు.. వివేకా పోటీ చేస్తారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా విరాళాల విషయంలో ఆయన గంట సేపు ప్రసంగిస్తే నాలుగున్నర లక్షల డాలర్ల విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. వివేక్ చర్చ ముగిసిన గంటలోనే ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా అమెరికన్లు నాలుగున్నర లక్షల డాలర్లు విరాళం ఇవ్వడంతో ఆయన ప్రసంగం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.


రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న తరుణంలో ఈయన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్లోరిడా గవర్నర్ డిసంటా తర్వాత స్థానాల్లో విక్రమ్ ఉన్నారు. ట్రంపు గైర్హాజరైన వివిధ సమావేశాల్లో ఈయన స్పీచ్ తో దూసుకుపోతున్నారని తెలుస్తోంది. అమెరికన్ పోల్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.


తొలి సమావేశంలోనే రామస్వామి వివేక్ స్పీచ్ అందరినీ ఆకర్షించిందని వాషింగ్టన్ జర్నల్ ప్రచురించింది. ఇతరులు అందరూ తేలిపోయారంటూ న్యూ యార్క్ టైమ్స్ మ్యాగజైన్ తెలిపింది. ఇది రిపబ్లికన్ పార్టీ షోలా కాకుండా రామస్వామి వివేక్ షో లా కనిపించిందని ఎన్ బీసీ వార్తా సంస్థ చెప్పింది.  చర్చ అనంతరం జరిగిన సమయంలో 28  శాతం మంది వివేక్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని చెప్పగా.. 27 శాతం ప్లోరిడా గవర్నర్ స్పీచ్ అద్భుతంగా సాగిందని చెప్పారు.


అయితే రాబోయే కొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా భారతీయ సంతతి వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కూడా దగ్గరలోనే ఉంది. ఒక వేళ ట్రంపు వయసు రీత్యా తాను కాదనుకుంటే మాత్రం ఉపాధ్యక్ష పదవి అయినా రామస్వామి వివేక్ కు దక్కేది. ఒక వేళ అమెరికా అధ్యక్ష పదవి దక్కితే మాత్రం రామస్వామి వివేక్ భారతీయ సంతతి నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన వైనం అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఇండియా అంటే మరో సారి నిరూపితమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: