అమెరికాలో కాల్పుల కలకలం....“ఎన్నారై మృతి”...
అగ్రరాజ్యంలో
మరోమారు కాల్పుల కలకలం ఎన్నారైలని ఉలిక్కిపడేలా చేసింది...ఉన్నట్టుండి ఒక్కసారిగా
గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాల్పులు జరపడంతో భారత సంతతి వ్యక్తి మృతి చెందారు..వివరాలలోకి
వెళ్తే..జార్జియా రాష్ట్రంలో బర్నెట్
ఫెర్నీ రోడ్డులో గల హైటెక్ క్విక్ స్టాప్కి తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి
ఉన్నట్టుండి ఒక్కసారిగా తుపాకీతో కాల్పులకి తెగబడ్డాడు..
ఈ సంఘటనలో పరంజిత్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు..కాల్పులు జరిపిన తరువాత..పక్కనే ఉన్న మరో దుకాణంలోకి వెళ్లి కౌంటర్ వద్ద డబ్బును దొంగలించి, అక్కడ పనిచేస్తున్న క్లర్క్ పార్థీ పటేల్పై కాల్పులకు తెగబడ్డాడు.
ఈ సంఘటన జరిగిన తరువాతా ఆ దుండగుడు పారిపోతున్న సమయంలో పోలీసుకు పట్టుకుని అరెస్టు చేశారు.. గత ఎనిమిదేళ్లుగా అదే ప్రాంతంలో ఉంటోన్న మృతుడు పరంజిత్ సింగ్కు ఇద్దరు పిల్లలు...ఆయన సోదరుడు కూడా అక్కడే వ్యాపారా కార్యకలాపాలను నిర్వహిస్తారు..అయితే ఆ నిందితుడు లమర్ రషద్ నికోల్సన్గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు కాల్పులకి గల కారణాలకోసం పోలీసుకు విచారణ చేపడుతున్నారు.
.