"శ్వేతసౌధం"... ప్రెస్ సెక్రటరీ కి చేదు అనుభవం...!!!

NCR

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , కిమ్ జాంగ్ ఉన్ భేటీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీకి చేదు అనుభవం ఎదురయ్యింది. కొత్త ప్రెస్ సెక్రటరీగా ఎన్నికైన స్టెఫానీ కి ఊహించని షాక్ తగిలింది. నార్త్ కొరియా సెక్యురిటీ దళాలు ఆమె ఎవరో తెలియకపోవడంతో పక్కకి తోసేశారు.దాంతో ఆమె వారితో తీవ్ర వాగ్వాదానికి దిగి దాదాపు గర్షణపడిన పని చేసింది.

 

అంతేకాదు ఈ ఇద్దరు దేశాధినేతల సమావేశ ప్రాంతంలో అమెరికన్ రిపోర్టర్లని సైతం వెళ్ళనివ్వలేదు . అయితే అమెరికా మీడియా ముందుకు వెళ్లేందుకు స్టెఫానీ అతికష్టం పై వచ్చి గో గో అంటూ గట్టిగా కేకలు పెట్టడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆమె ఇటీవలే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు.

 

ఇదిలాఉంటే సౌత్ కొరియా భవనమైన హౌస్ ఆఫ్ ఫ్రీడమ్ బయట స్టెఫానీ, తమ దేశ జర్నలిస్టులకి  ఆదేశాలు ఇస్తూ కనపడ్డారు. అయితే ఆదివారం రోజున ఇరు దేశాధినేతల మధ్య తీవ్రంగా చర్చలు జరిగాయి. అంతా బాగానే ఉన్నా ట్రంప్ కి అత్యంత సన్నిహితురాలు, బలమైన మద్దతుదారురాలైన  స్టెఫానీకే ఇలాంటి ఘోరమైన అవమానం కలగడంతో అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: