పవన్ ని చిరు ఆటపట్టించాడా..! వీడియో వైరల్..!

Edari Rama Krishna
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ విందులో పాల్గొన్నారు.  సాధారణంగా చిరంజీవి, పవన్ కళ్యాన్ ఒక చోట ఉంటే మీడియా దృష్టి మొత్తం అటువైపే ఉంటుంది. 

ఇక గవర్నర్ ఇచ్చిన విందులో మెగాబ్రదర్స్ సందడి చేసిన విషయం తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పవన్ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్ ముచ్చటించారు.  ఇక పవన్, కేసీఆర్ కలిసి సరదగా మాట్లాడుకోవడం కనిపించింది.

తర్వాత పవన్ అతిథులతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన చిరు తన కుడి చేతితో పవన్ నడుము మీద తట్టారు. అందుకు స్పందించిన పవన్ వెనుకకు తిరిగి చూడగా.. చిరు తన ముందున్న వాళ్లతో మాటలు కలిపారు. 

చిరంజీవి చిలిపితనంగా నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.  ఆ తర్వాత అన్నయ్యతో కాసేపు పవన్ మాట్లాడుతూ కనిపించారు..వీరితో పాటు రానా కూడా ఉన్నారు.  విందు కార్యక్రమంలో అన్నదమ్ములిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: