దేశంలో ప్రస్తుతం నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాలు కూడా ఇదే తెలియజేస్తున్నాయి. ప్రతి మూడు గంటలకు ఓ రేప్ కేసు, ప్రతి రెండు గంటలకు ఓ హత్య కేసు దేశంలో నమోదవుతున్నాయి. వీటి దర్యాప్తు కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. పేరుకే పని గంటలున్నప్పటికీ... సిబ్బంది కొరత కారణంగా అవేవి ప్రస్తుతం అంతగా అమలు కావటం లేదు. సాధారణంగా దేశంలో ప్రతి 100 వంది జనాభాకు ఒక పోలీసు ఉండాలి. కానీ ప్రస్తుతం వెయ్యి మందికి కూడా లేని దుస్థితి. దీంతో పోలీసులపై పని ఒత్తిడి భారీగా పెరిగింది. కొ