తిరుమల : ఇవాల్టి నుంచి 15 వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వాహన సేవలు ప్రతి నిత్యం ఉదయం 9 గంటలకు….రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని.. గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కోవిడ్ మహమ్మారి తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూన్నామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడం తో స్వర్ణ రథం, మహరథం బదులుగా సర్వ భూపాల వాహన సేవ ను నిర్వహిస్తామని వెల్లడినచ్చారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. చక్రస్నాన కార్యక్రమాన్ని ఆలయం లోని అద్దాల మహల్ లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం తరపున ఈ నెల 11వ తేదిన సియం జగన్ మోహన్ రెడ్డి పట్టువస్ర్తాలను సమర్పిస్తారని వెల్లడించ్చారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
11వ తేదిన బర్డ్ హస్పిటల్ ప్రాంగణంలో పిడియాట్రిక్ కార్డిక్ హస్పిటల్ ,గో మందిరం,అలిపిరి నడకమార్గాని సియం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. 12వ తేదిన అదనపు బూందీ పోటు, యస్వీబిసి కన్నడ హిందీ చానల్స్ ని సియం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటన చేశారు. కన్నడ చానల్ ప్రారంభోత్సవం లో కర్నాటక సియం బోమ్మై పాల్గోంటారని.. 13 జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. టిటిడి వాహనాల ఏర్పాటు చేసి భక్తులును ఉచితంగా తిరుమలకు తరలిస్తామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామి వారి దర్శనం పొందలన్నారు,