వైసీపీ నేతల కొత్త టార్గెట్... ఆయనే..!x
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవాలనుకునే వారు... ముందుగా సజ్జల అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు... వారికి కావాల్సిన పని పూర్తవుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఇదే పరిస్థితి. మొదట్లో పార్టీ వ్యవహారాలకే పరిమితమైనట్లు కనిపించారు సజ్జల. కానీ... ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంపీ విజయ సాయిరెడ్డి కేవలం విశాఖకే పరిమితం కావడంతో... రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దే పని సజ్జల తీసుకున్నారు. పార్టీకి అండగా ఉన్న పెద్దలతో పాటు.... కీలక నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సజ్జల ప్రభుత్వంలో కూడా మెయిన్ లీడర్గా ఎదిగారు. ప్రస్తుతం ఏ విషయం అయినా సరే... సజ్జల స్పందిస్తే సరిపోతుంది. చివరికి మంత్రులు కూడా ఆయా విషయాలపై మాట్లాడటం లేదు. ఇదే విషయం ఇప్పుడు పార్టీలో చాలా మంది నేతలకు ఇబ్బందిగా మారింది. కొంత మంది అయితే... అసలు సజ్జల ఎవరూ... ఆయనకు ఎందుకు చెప్పాలి... మేము కూడా పార్టీలో సీనియర్లమే కదా... ఆయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు... మాపై ఆయన పెత్తనం ఏమిటీ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.