ధరల మోత... పాపం మిడిల్ క్లాస్ మ్యాన్..!
కొత్తగా ధరలను పెంచేందుకు ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. గతంలో 2017 ఏడాది మార్చి నెలలో అన్ని టీవీ ఛానళ్లకు సంబంధించిన ధరలకు సంబంధించిన కొత్త టారీఫ్ ఆర్డర్ను ట్రాయ్ జారీ చేసింది. ఈ ఆర్డర్పై ఎన్నో సమస్యలు అప్పట్లో వచ్చాయి. దీంతో మరోసారి కొత్త టారీఫ్ జారీ చేయాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. 2020 ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి సవరించిన ఆర్డర్ను మళ్లీ జారీ చేసింది ట్రాయ్. దీనికి ఎన్టీఓ 2.0 అని పేరు పెట్టారు కూడా. ఈ టారీఫ్లో భాగంగా... ఈ ఎన్టీఓ 2.0లో భాగంగా ఒక్కొక్క ఛానల్ కనీస ధరను 12 రూపాయలుగా నిర్ణయించింది ట్రాయ్. అన్ని ప్రముఖ ఛానళ్లను తక్కువ ధరకే అందించాలనేది ట్రాయ్ ఆలోచన. గతంలో ఈ ధర ప్రతి నెల 15 రూపాయల నుంచి 25 రూపాయల మధ్య ఉండేది. కొత్త టారీఫ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమలుల్లోకి వస్తే... అన్ని టీవీ ఛానళ్ల ధరలు పెరగనున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెల్లిస్తున్న దాని కంటే కూడా రెట్టింపు డబ్బు కట్టాల్సిందే. అంటే సామాన్యుల నెల వారీ బడ్జెట్ లెక్క అమాంతం పెరగనుంది.