టిడిపి, బిజేపి లపై మండిపడ్డారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని.. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగ కుండా పత్రిక సమావేశాలకు పరిమితమన్నారు. ప్రభుత్వం పై బురదజల్లేందుకే ఆరోపణలు.. అని.. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తామని.. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని గుర్తు చేశారు.
సోమశిల విషయంలో పెండింగ్ లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్.. చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం అర్హులైన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తుందని.. బీజేపీ నేతలు మందిమార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదని.. ప్యారా మిలిటరీ బలగాలు మొహరిపజేసి హడావుడి చేయాలనే ప్రయత్నం అని పేర్కొన్నారు. మొత్తం ఆర్మి బలగాలు దించినా మాకు ప్రజాబలం ఉందని.. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నామని వెల్లడించారు.
మీకు ప్రజాబలం లేదనే బురదజల్లే ప్రయత్నమని.. ఎన్నికల కమిషన్ ను మేము కూడా అడుగుతున్నాం.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ , బీజేపీ కలయికతోనే రాష్ట్రం నిలువునా విభజన అని.. మాకు రాజకీయ ప్రయోజనాల కంటేరాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటామని.. చట్టంలో ఉన్న హామీలనే అడుగుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, దుగరాజపట్నం , స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటామన్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తామని తెలిపారు. పెట్రోల్ , డీజల్ , గ్యాస్ ధరలు ఎందుకు పెంచుతున్నారు.. ఎందుకు మాట్లాడడం లేదన్నారు.