పెద్దాయన పెద్దిరెడ్డి : ఇంటర్వెల్ ట్విస్టు అదిరిపోయింది సర్?
ఈ నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లు ను తాము ఉపసంహకరించుకుంటున్నామని, దీనిపై అసెంబ్లీలో సీఎం స్పష్టమయిన ప్రకటన చేస్తారని హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇది ప్రజా విజయం అని ఎంపీ రఘురామ అ ని అంటే, అదేం కాదని బిల్లులో న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని, వాటిని సవరించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నా మని పెద్దాయన పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఇది కేవలం విరామం మాత్రమే అని స్పష్టం చేశారు. రాజధాని కి సంబంధించి రైతులు చేస్తున్న ఉద్యమం చూసి తాము బెదిరిపోలేదని మరో మారు చెప్పారు పెద్దిరెడ్డి. అంటే రాజధానిని మార్చేం దుకు వైసీపీ సన్నాహాలు చేస్తోందని బిల్లులో సవరణల కోసమే ఇప్పుడీ మాట చెప్పిందని తేలిపోయింది. బిల్లులో న్యాయ పరమై న అడ్డంకులను సవరించి మళ్లీ కొత్త బిల్లు తీసుకువచ్చేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎగువ సభ అయిన శాసన మండలిలో జగన్ కు మద్దతు ఉండడంతో బలం పెరగడంతో తాజా బిల్లు ఉభయ సభల ఆమోదం పొందేందుకు ఎటువంటి ఆటంకం ఉండదు. మరో విషయం ఏంటంటే ఎలానూ తనను అవమానించిన సభకు తాను రానని ముఖ్యమంత్రి అయ్యాకే వస్తాన ని విపక్ష నేత హోదాలో చంద్రబాబు చెప్పడంతో వైసీపీకి ఇక ఎదురే ఉండదు. కనుక ఇదంతా ఇంటర్వెల్ మాత్రమేనని క్లైమాక్స్ మరోలా ఉంటుందని పెద్దాయన పెద్ది రెడ్డి చెప్పిన మాటల వెనుక సిసలు ఆంతర్యం ఇదే! అందుకే రాజధాని రైతులు సైతం తమ పాదయాత్ర ఆపబోమనే చెబుతున్నారు.