బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో చారిత్రక తీర్మానాన్ని ప్రవేశపెట్టామని.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. 1931 లో జరిగిన కులగణన తర్వాత జరగలేదని... గతంలో ఏ పార్టీలు బీసీల కు చెందిన కొన్ని కులాల పేర్లను కూడా ఉచ్చరించలేదన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. అందుకే జనాభా గణనలో ఒక కాలమ్ పెట్టి కులాలను గణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశామన్నారు. బీసీల్లో చైత్యనానికి నాంది పలికెలా ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపామ్.. ఎంత మంది బీసీలు ఉన్నారో వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏడాదికి 60 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి శాసనమండలి రద్దు చేస్తున్నట్టు గతంలో ప్రభుత్వం శాసనసభ లో తీర్మానం చేశారని.. కేంద్రానికి కూడా పంపారన్నారు ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం.
అది పెండింగ్ లో ఉంది కాబట్టి, వారి సభ్యుల సంఖ్య ఇప్పుడు పెరిగింది కాబట్టి అవస రం అయ్యిం దా అ ని నిలదీశారు ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం. అప్పుడు 60 కోట్లు దండగ అయ్యింది ఇప్పుడు కాదా. ఇలా ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేయకూ డదని... ఇప్పుడు వికేంద్రీకరణ చట్టాన్ని కూడా వెనక్కు తీసుకున్నారన్నారు ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం. మూడు రాజధానులకు అనుకూల మని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు ఉపసంహరణ చేసిందని.. అన్ని వ్యవస్థ లు ఒకే చోట ఉండాలని మేము కోరుతున్నామని చెప్పా రు ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం. అధికార పార్టీ వేసేది అన్ని పిల్లిమొగ్గలే అని... తప్పులు చేయడం మళ్ళీ నిర్ణయాలను వెనక్కు తీసుకో వడం ఓ ఆనవాయితీగా మారిపోయిందన్నారు ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం. ఎయిదేడ్ పాఠశాలల విషయం లోను అదే జరిగిందని తెలి పారు.