దీదీ గూటికి బీజేపీ సీనియర్ ఎంపీ...!
అధికారంలోకి వచ్చిన నాటి బీజేపీ ప్రత్యామ్నాయంగా పావులు కదుపుతున్న మమతా... థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తోంది. అయితే బెంగాల్లో మమతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె నుంచి దూరంగా వెళ్లిపోయిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక నేత కూడా మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. సంచలన వ్యాఖ్యలతో సంచలనాలకు కేంద్ర బిందువైన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇప్పుడు మమతాకు బాసటగా నిలిచారు. ఢిల్లీ పర్యటకు వచ్చిన మమతా... ముందుగా సుబ్రమణ్యస్వామితో భేటీ అయ్యారు. సరిగ్గా 24 గంటల ముందు బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్తో సుబ్రమణ్యస్వామి సమావేశమయ్యారు. మమతా మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసానికి స్వయంగా సుబ్రమణ్యస్వామి రావడం కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రధానితో భేటీకి ముందు సుబ్రమణ్యస్వామి స్వయంగా వచ్చి కలవడం... తాను మమతా వెంటే ఉన్నానని చెప్పడం మరింత కీలకంగా మారింది.