గుడ్ న్యూస్.. ఇండియాలో థర్డ్వేవ్కు నో ఛాన్స్..?
ఎందుకంటే.. ఇప్పుడు యూరప్ దేశాలను కరోనా మళ్లీ వణికిస్తోంది. అక్కడ ఆస్పత్రులన్నీ మళ్లీ నిండిపోతున్నాయి. కరోనా రెండు డోసులు తీసుకున్నా అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి ఇండియాలోనూ మళ్లీ అలాంటి దృశ్యాలు తప్పవా అన్న ఆందోళన ఉంది. దీని గురించి తాజాగా చెన్నై శాస్త్రవేత్తలు చెబుతున్న లెక్కలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. వారు ఏం చెబుతున్నారంటే.. హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగడం తదితర కారణాలతో భారత్లో కొవిడ్ మూడో దశ ముప్పు ఎక్కువగా ఉండకపోవచ్చట.
అంతే కాదు.. ఇండియాలో కరోనా మూడో దశ సెప్టెంబర్ మధ్యలోనే వచ్చిందట. అది మనం గుర్తించలేని స్వల్ప స్థాయిలో ఉందట. అయితే. డిసెంబర్, ఫిబ్రవరి నెలల మధ్య దేశంలో కరోనా కేసుల సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందంటున్నారు మరికొందరు నిపుణులు. అయితే దాని ప్రభావం ప్రజలపై అంతగా ఉండదట. కొవిడ్ రెండో దశలోనే అనేక మంది కరోనా బారినపడ్డారు కాబట్టి.. అలాంటి వారిలో వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరిగిందట.
దీంతో పాటు ఎలాగూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందువల్ల ఇండియాలో ఇక వైరస్ వ్యాప్తి అంతగా ఉండకపోవచ్చని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఇండియాలో కేసులు మరీ బాగా తగ్గాయి. 543 రోజుల కనిష్ఠానికి చేరాయి. సో.. ఇక ఇండియాలో మూడో ముప్పు లేనట్టే అంటున్నారు నిపుణులు.