ఎంపీ ఎక్సోఫిషియో ఓటు పై అమీ తుమీనా...!
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చుట్టు తిరుగుతుండగా ఆయన ఓటు అసలు చెల్లుతుందా లేదా అన్న దానిపైనే విస్తృతంగా చర్చ నడుస్తోంది. టీడీపీ అధినాయకత్వం చెప్పినట్లు ఎంపి ఓటు పై స్పష్టమైన సమాచారం ఉంటే తీర్పు ఎందుకు వాయిదా పడుతుంది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇంకో వారం పాటు కొండపల్లి మున్సిపాలిటీ పై తీర్పు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారంతో సరిపెడతారా... లేక మరి కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరో వారం రోజుల పాటు వేచి చూడాల్సిందే. ఎక్స్ అఫీషియోగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలో ఎంపీ కేశినేని నాని గతంలో ఓటు నమోదు చేసుకున్నారు. కానీ దానిని వినియోగించుకోలేదు. కొండపల్లి మునిసిపల్ అధికారులు ఓటు నమోదు చేసుకోవాలని అడిగినా ఆయన అందుకు విముఖత చూపారని... దీంతో ఎక్స్ అఫిషియోగా ఎంపీ ఓటు చెల్లదని అంటున్నారు వైసీపీ నేతలు. చూడాలి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో.