ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్సీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. వారం రోజుల్లో పీఆర్సీ పై ప్రకటన చేస్తామని ఈ రోజు ఉదయమే తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులతో అన్నారు. కానీ ఈ సాయంత్రమే ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. సచివాలయంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లకు ప్రభుత్వం నో చెప్పేసింది. పీఆర్సీ నివేదికను మ