లోకేష్ను ఓడించింది బాబే... కొడాలి కామెంట్..!
తనపైన, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపైన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఆరోపించారు. ఇవన్నీ కూడా లోకేష్ దగ్గరుండి చేయించారన్నారు కొడాలి నాని. ఇలాంటి వారిని ఏం చేయాల్లో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఏమైనా అనొచ్చా అని నిలదీశారు. అసలు వంశీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.... అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు మాత్రమే అని కొడాలి నాని వెల్లడించారు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడానికి చంద్రబాబు మాత్రమే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ముఖ్యమంత్రి పదవికి పోటీ వస్తాడమే భయంతోనే లోకేష్ను చంద్రబాబు ఓడించాడన్నారు. రాజకీయంగా ఎదగడం కోసం వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటే అన్నారు కొడాలి నాని. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత ఎన్టీ రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారన్నారు. గత ఎన్నికల్లో కూడా లోకేష్ గెలిస్తే తనకు సీఎం పదవి దక్కదనే భయంతోనే ఓడించినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. జగన్ను గాల్లో వస్తాడు... గాల్లో పోతాడు అని వ్యాఖ్యానించడం వెనుక అర్థం ఏమిటో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.