మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం తో పలువురు షాక్కు గురయ్యారు. రోశయ్య తో తమకు ఉన్న అనుబంధాన్ని ఒక్కొక్కరు నెమరు వేసుకుంటున్నారు. రేపు గాంధీభవన్ కు రోశయ్య పార్థివదేహం తరలిస్తారు. రోశయ్య మరణం పై సోనియా, రాహుల్ గాంధీలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారు. రోశయ్య కుమారుడితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోశయ్య నివాసానికి రేవంత్ వెళ్లనున్నారు