పార్లమెంట్ లో.. విశాఖ ఉక్కు, రైల్వే జోన్ ల ప్రస్తావన..!
మరో మంత్రి ఎంవీ సత్యనారాయణ విశాఖ ఉక్కుపై ప్రస్తావించారు. కేంద్రం దానిని ప్రైవేట్ పరం చేయకుండా సొంత ఘనులు ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. ప్రైవేట్ వాళ్ళు ప్లాంట్ నడపడం పైన కంటే ఉన్న స్థలాలను రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తారని గ్రహించాలి. ఆ ఉక్కు పరిశ్రమ కోసం చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. దానిని మళ్ళీ కేంద్రం తీసుకెళ్లిపోవడం వలన ఆనాటి త్యాగాలకు అర్ధం లేకుండాపోతుంది. ఇప్పటీకే కార్మికులు దానిపై చాలా రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఎన్నో లేఖలు ప్రధాని గారికి కూడా రాయడం జరిగింది. అవన్నీ పరిగణలోకి తీసుకోని నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆశిస్తున్నాము. విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కుగా కేంద్రం గురించాలని కోరుతున్నాం.
మంత్రి గోరెంట్ల మాధవ్, రాత్రి సమయాలలో కూడా శవపరీక్ష సేవలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఆయా పరీక్ష నివేదికలు కూడా రాతపూర్వకంగా కాకుండా టైపు చేసినవి అయితే స్పష్టంగా ఉంటాయని, లేదంటే ఆయా చేతి రాత అర్ధం కావడం లేదని తెలిపారు. అలాగే తనకు రఘురామకృష్ణం రాజుగారు ఎదురైనంత మాత్రాన తిట్టినట్టే కథలు అల్లేస్తుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.