ఔటర్ రింగ్ రోడ్ షాక్: అమరావతికి నైనై.. రాజమండ్రి సైసై..?
ఆ విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ఏపీలోని మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరైంది. ఇంతకీ ఆ సిటీ ఏమిటనుకుంటున్నారా..అదే రాజమండ్రి.. అవును.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ ను కేంద్రం మంజూరు చేసిందట. ఈ విషయాన్ని ఎంపీ భరత్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి తనకు ఉత్తర్వులు అందాయని ఎంపీ భరత్ చెబుతున్నారు. రాజమండ్రి చుట్టూ 25 నుంచి 30 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ భరత్ చెబుతున్నారు.
రాజమండ్రి చరిత్రలోనే ఇది మరిచిపోలేని రోజని ఎంపీ భరత్ ఆనందం వ్యక్తం చేశారు. రాజమండ్రికి రింగ్ రోడ్ సాధించడం తనకు గర్వకారణంగా ఉందని ఎంపీ భరత్ అంటున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ రాజమండ్రి రింగ్ రోడ్ నిర్మాణం అవుతుందని ఎంపీ మార్గాని భరత్ అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంపీ భరత్ చెబుతున్న విషయమే.. దీనిపై కేంద్రం అసలు ఏం చెప్పింది.. ఆ లేఖలో ఏముందనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఏదేమైనా ఏపీలో ఓ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఓ నగరం విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పనలో ఔటర్ రింగ్ రోడ్డు చాలా కీలకపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.