వైసీపీలో ఈ ఎంపీలకు టిక్కెట్లు లేవా... వాళ్లు కూడా తెగించేశారా ?
అందుకే ఈ సారి వైసీపీ లో చాలా మంది సిట్టింగ్ ఎంపీలు తిరిగి పోటీ చేసే పరిస్థితి లేదు. సీనియర్లు ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తో పాటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఈ సారి సీట్లు వచ్చే పరిస్తితి లేదు. ఇక కాకినాడ ఎంపీ వంగా గీత, అనకాపల్లి ఎంపీ సత్యవతి, అమలాపురం ఎంపీ అనూరాధ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ , బాపట్ల ఎంపీ నందిగం సురేష్కు ఈ సారి టిక్కెట్లు రావని అంటున్నారు.
ఇక నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు ఎలాగూ టిక్కెట్ రాదు. అయన్ను పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తుంది ? లేదా అంతకన్నా ముందే ఆయన తన పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా ? అన్నది చూడాలి. ఇక నరసారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు వచ్చే ఎన్నికల్లో తిరిగి మరోసారి ఎంపీ గా పోటీ చేయరన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ల సీట్లకు కోత తప్పేలా లేదు.