అమరావతి : పోర్టులు, ఎయిర్పోర్టులపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం వైయస్. జగన్. తెలంగాణ రాష్ట్రం లో కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణ పనుల పురోగతి పై ఈ సందర్భంగా సీఎంకు వివరాలందించారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహణ లో ఉన్న విమానాశ్రయాలు 6 తిరుపతి, కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు పట్టణాలలో ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెఫ్ట్ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్పోర్టు ఉండాలని.. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్ని జిల్లాల్లో ఒకే రకంగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని.. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్టండన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్వే అభివృద్ధి చేయాలని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానా శ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని.. ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయండని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టండని.. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయండన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలి.. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రద్దీకి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్.