మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా తెలంగాణ, ఛత్తీస్ఘడ్ పోలీసులు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ఇంకా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి హిడ్మా విషయంలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు గెరిల్లా దళానికి నాయకత్వం వహిస్తున్న హిడ్మా రక్షక దళాలకు లొంగిపోయాడని మావోయిస్టు ప్రభావ రాష్ట్రాలైన ఛత్తీస్ఘడ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కొద్దిరోజులుగా విస్తృత స్థాయిలో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో హిడ్మా లొంగిపోయాడంటూ ఒక వ్యూహం ప్రకారం పోలీసులు ప్రచారం చేస్తూ తమను మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని మావోయిస్టు నేతలు అంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పోరాట దళ సభ్యుడు మాడవి హిడ్మా పోలీసులకు లొంగిపోయిన విషయం వాస్తవమే. ఈ అంశంపై పోలీసులు చేసిన ప్రకటన ప్రకారం లొంగిపోయిన దళ సభ్యుడు హిడ్మా వయసు 25 సంవత్సరాలు. ఇతడు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుక్మా
{{RelevantDataTitle}}