ఎమ్మెల్సీ అనంతబాబుకి మరో షాక్..
బెయిల్ ఇక రాదా..?
అనంతబాబు కి బెయిల్ రాకపోవడంతో ఆయన మరో 11రోజులపాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే బెయిల్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, డ్రైవర్ హత్య కేసులో అనంత బాబు నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందంటూ.. పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ కస్టడీ పిటిషన్ లో సమగ్ర వివరాలు లేవని జడ్జి ఆ పిటిషన్ ని రిజక్ట్ చేశారు. దీంతో జులై 1 వరకు ఆయనకు కస్టడీ కూడా కుదరజు, రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండాలి.
ఇక అనంతబాబు పొలిటికల్ కెరీర్ విషయానికొస్తే.. వైసీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ ఇటీవల కొన్ని కార్యక్రమాలలో అనంతబాబు అభిమానులు ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేశారు. అయితే వైసీపీకి ఈ పాలాభిషేకాలతో సంబంధం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక ప్రతిపక్షాలు అనంతబాబుని ఎమ్మెల్సీగా అనర్హుడిని చేయాలంటూ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ కేవలం పార్టీనుంచే సస్పెండ్ చేసిందని, ఆయన్ను మండలి నుంచి కూడా సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.