క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వాడకం ఈ మధ్య కాలం లో ఎక్కువ అయ్యింది.. ప్రస్తుతం అన్నీ డిజిటల్ గానే పేమెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల లో కస్టమర్లకు భద్రత ఉండటం లేదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. 2022 జులై 1 నుంచి ఆన్లైన్ వ్యాపారులు కార్డ్ డేటాను స్టోర్ చేసే వీల్లేకుండా చేసింది. కస్టమర్ల ను సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాదే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టోకనైజేషన్ రూల్స్ ఇష్యూ చేసింది.
దేశీయ ఆన్లైన్ కొనుగోళ్ల కోసం ఆర్బీఐ కార్డ్-ఆన్-ఫైల్ టోకెన్లను స్వీకరించడం తప్పనిసరి చేసింది. దేశ వ్యాప్తంగా కార్డ్ టోకెన్లను స్వీకరించడానికి గడువు జనవరి 1, 2022 నుంచి జూలై 1, 2022 వరకు ఆరు నెలల పాటు పొడిగించారు. కస్టమర్లు సురక్షితమైన లావాదేవీలు చేయడం లో సహాయ పడేందుకు ఇది ఎన్క్రిప్టెడ్ "టోకెన్"గా నిల్వ చేయనున్నారు. ఇవి కస్టమర్ వివరాలను బయటకు తెలియనివ్వకుండా చెల్లింపు చేయడానికి వీలుగా ఉంటుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ఒరిజినల్ కార్డ్ డేటాను ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్తో భర్తీ చేయడం తప్పనిసరి చేసింది.
ఆ కారణం వల్లే వ్యాపారులు తమ రికార్డుల నుండి కస్టమర్ల డెబిట్, క్రెడిట్ కార్డ్ల డేటాను తొలగించాల్సి ఉంటుంది.కార్డ్ టోకనైజేషన్ సిస్టమ్ తప్పనిసరి కాదు. అందువల్ల కస్టమర్ తన కార్డు టోకనైజేషన్ కోసం అప్రూవల్ ఇవ్వనట్లయితే, కస్టమర్ ఆన్లైన్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ కార్డ్ ధ్రువీకరణ లేదా CVVని నమోదు చేయడానికి బదులుగా పేరు, కార్డ్ నంబర్, కార్డ్ చెల్లుబాటు వంటి అన్ని కార్డ్ వివరాల ను నమోదు చేయాలి. కస్టమర్ కార్డ్ టోకనైజేషన్ పట్ల అంగీకరించినట్లయితే, లావాదేవీ చేస్తున్నప్పుడు CVV లేదా OTP వివరాలను మాత్రమే ఎంటర్ చెయ్యాలి. టోకనైజేషన్ సిస్టమ్ పూర్తిగా ఉచితం..ఒకరి కార్డ్ డేటాను సురక్షితంగా ఉంచేటప్పుడు సున్నితమైన చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది..