పోస్టాఫీసు పథకాలలో రాబడి ఎక్కువగా వుంటుంది.అందుకే పొదుపు పథకాలలో ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసే వారికి గుడ్న్యూస్. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పొదుపు పథకాలకు సంబంధించి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటివి ఇకపై ఆన్లైన్లో తెలుసుకోవచ్చు..ఈ మేరకు తపాలా శాఖ ఇ-పాస్బుక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 12 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది.