పెన్షన్ పథకాల పై ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది.. పాత పద్దతుల ద్వారా పెన్షన్ ను ఇవ్వబోతుందని తెలుస్తుంది. పాత పెన్షన్ పథకం పునరుద్ధరించే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పష్టం చేశారు. సోమవారం లోక్ సభ ప్రశ్నోత్తరా ల్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. పాత పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు నిర్ధిష్ట పెన్షన్ లభిస్తుంది.ఆఖరి నెల వేతనంలో సగం వేతనం పెన్షన్గా పొందుతారు. కానీ, 2004 లో అమల్లోకి వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ మొత్తం కంట్రిబ్యూటరీగా ఖరారు అవుతుంది..
కాగా, తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునః ప్రారంభిస్తామని కేంద్ర సర్కార్కు, పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కు జార్ఖండ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తెలిపాయి. దీంతో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భాగవత్ కరాద్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులను ఎన్పిఎస్ నుండి ఒపిఎస్గా మారుస్తున్నట్లు పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం నవంబర్ 18 న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం కేంద్రాని కి సమాచారం ఇవ్వలేదని భగవత్ తెలిపారు. పాత పెన్షన్ పథకం అమలు చేయడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ యాక్ట్ -2013 కింద ఎటువంటి నిబంధనల్లేవని స్పష్టం చేశారు.. ఇందులో ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా ఉద్యోగి చివరి పెన్షన్లో 50 శాతం పొందుతాడు. అలాగే, 2004 సంవత్సరం లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పిఎస్ ని అమలు చేసింది. ఈ పథకం కింద ఉద్యోగులు వారికి సంబందించిన విధానం ఆధారంగా మాత్రమే పెన్షన్ పొందుతారు...