బాబుతో ఆటాడుకున్న టీవీ9, ఏబీఎన్.. రేవు పెట్టిన సాక్షి..!?

Chakravarthi Kalyan
ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్రం  తేల్చి చెప్పిన నేపథ్యంలో టీవీ ఛానళ్లు కూడా టీడీపీ చీఫ్ చంద్రబాబును ఓ ఆటాడుకుంటున్నాయి. గ్రాఫిక్స్ ఉపయోగించి కామెడీ కార్టూన్ తరహా బొమ్మలు చేయించి చంద్రబాబుకు చురకలు వేస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీకి అనుకూలంగా ఉంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఒకింత రెచ్చిపోవడం ఆశ్చర్యం కలిగించేదే..

ఏపీకి ప్ర్తత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రమంత్రులు తేల్చి చెప్పిన సమయంలోనే ఏబీఎన్ ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ తయారు చేయించింది. చంద్రబాబుకు మోడీ స్వయంగా చేత్తో టోపీ పెడుతున్నట్టు ఈ బ్యాక్ గ్రౌండ్ తయారు చేయించింది. చంద్రబాబు ఏమీ చేయలేక తెల్లమొఖం వేసినట్టు ఆ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కేంద్రమంత్రులు ఇద్దరూ హోదా లేదని ప్రకటించిన సమయంలో ఈ బ్యాక్ గ్రౌండ్ ప్రదర్శించారు. 

బాబుపై కౌంటర్లే కౌంటర్లు.. 


ఆ తర్వాత తాజాగా బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మరోసారి క్లారిటీగా హోదా లేదని తేల్చిసిన సమయంలోనూ ఇదే బ్యాక్ గ్రౌండ్ కంటిన్యూ చేశారు. ఏపీకి టోపీ పేరుతో టైటిల్ వేశారు. ఇది చూసి టీవీ9 కూడా స్ఫూర్తి పొందినట్టు కనిపించింది. అందరికన్నా ముందుగా ఏబీఎన్ ఏపీకి టోపీ అని మోడీతో చంద్రబాబుకు టోపీ పెట్టిస్తే.. టీవీ9 ఏకంగా చంద్రబాబు చెవిలో పువ్వులు పెట్టేసింది. 

హోదాకు పాతర పేరుతో బ్యాక్ గ్రౌండ్ చేయించి చంద్రబాబు బొమ్మకు చెవిలో పువ్వులు పెట్టించింది టీవీ9. ఇక బాబు ప్రత్యర్థి ఛానల్ సాక్షి సంగతి చెప్పేపనే లేదు. చంద్రబాబు హోదా గురించి వివిధ సందర్భాల్లో చెప్పిన క్లిప్పింగులను నాలుగు బాక్సుల్లో చూపిస్తూ రచ్చ చేస్తోంది.  ఇలా మీడియా చంద్రబాబుతో ఓ ఆట ఆడుకున్న తీరు చూస్తే టీడీపీ అధినేత పరిస్థితిపై జాలి కలగక మానదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: