ఒక దేశాన్ని నాశనం చేయలాంటే... సైన్యం, ఆయుధాలు, వాహానాలు, యుద్ద విమానాలు, బాంబులు లేకాకుండా.. ఆ దేశాన్ని నాశనం చేయాలన్న కసి వగైరా వగైరా ఉండాలి. అంతేకాదు ఇవన్నీ సమకూర్చుకోవాలంటే మాత్రం మనీ కావాలి. మనీ వచ్చాక అన్నీ రెడీ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు యుద్దం చేయవచ్చు. మనందరికి తెలిసిన విషయం మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న దేశాలు ఏవో... అవేనండీ పాకిస్థాన్ అండ్ చైనా...!! కానీ మీకు తెలియని ముఖ్య విషయమేటంటే... మనమీద యుద్దం చేయడానికి మనమే వారికీ డబ్బులు ఇస్తున్నాం...! ఎలాగంటే... తిండికి కూడా గతిలేని పాకిస్థాన్ కు లక్ష కోట్లు రూపాయలతో చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కింద చైనా నుండి మన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా పాకిస్థాన్ వరకు హైవే నిర్మించాల్సిన అవసరం ఏమిటి చైనా కు?
దేశం చుట్టు సిల్స్ రోడ్ లను కట్టిస్తున్న చైనా
అది చాలదని ఆ హైవేకి లింక్ చేస్తూ పాకిస్థాన్ లోని గ్వాడర్ పోర్టు ని నిర్మించింది ఫ్రీగా. అంతగా అవసరం లేని శ్రీలంక కి, బంగ్లాదేశ్ కి, మ్యన్మార్ కి, మాల్దీవ్ లకు ఫ్రీగా పోర్ట్స్ కట్టిస్తోంది చైనా. దానిపేరు స్ట్రీంగ్ ఆప్ పిరల్స్ అండ్ మరిటైమ్ సిల్స్ రోడ్. ఇంతకీ చైనాకు పోర్ట్స్ కట్టించాల్సిన అవసరం ఏముంది? అయితే చైనా కట్టిస్తున్న పోర్టు ప్రాంతం మొత్తం మన చుట్టూ ఉన్న దేశాలే. ఎవరైననా ప్రశ్నిస్తే మేము వాళ్ల తో వ్యాపారం చేసుకుంటున్నాం అంటొంది చైనా దేశం. కానీ అసలు నిజం, కుట్ర పూరిత వాస్తవం ఏటంటే... బంగాళాఖాతంలో... హిందూ మహాసముద్రంలో, ఆరేబియా సముద్రంలో తమ సైన్యాన్ని మొహరించడానికి... వ్యాపారానికి సైన్యం ఎందుకు అని ప్రశ్నిస్తే పడవలకు రక్షణ అని బోంకుతుంది.
దేశం లోపలికి చొచ్చుకొచ్చిన చైనా..
కానీ అసలు విషయమేమింటంటే... మన దేశం చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. చైనా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు దాటి 100 కిలో మీటర్లు మన దేశంలోపలికి వచ్చేసింది. ఒకసారి గతంలోకి వెళ్లి భారత్-చైనా సంబంధాల ను పరిశీలిస్తే... ప్రపంచంలో విస్తీర్ణంలో అతి పెద్ద దేశాల్లో మూడో పెద్ద దేశం చైనా. జనాభా లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ విషయానికొస్తే ప్రపంచంలో విస్తీర్ణం పరంగా 7 స్థానంలో నిలుస్తోంది. జనాభా లో చైనా తరువాత రెండో స్థానంలో ఉంది. ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా... జనాభా పరంగా... ఈ రెండు మాత్రమే పెద్ద దేశాలు. కానీ చైనా మొదటి నుంచి భారత్ కు పక్కలో బల్లెంలా వ్యవహరిస్తోంది. మనదేశం కంటే రెండేళ్లు ఆలస్యంగా 1949 లో స్వాత్రంత్య్రం పొందిన చైనాకు మొదటి నుంచి భారత్ అండగా నిలబడింది.
హిందీ -చీనీ భాయ్ భాయ్..
దాని సార్వభౌమాధికారాన్ని తొలిగా గుర్తించిన దేశాల్లో భారత్ ఒకటి. అప్పటి చైనా ప్రధాని చౌఎన్ లై.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే నినాదం ఇచ్చాడు. ఇరు దేశాల మధ్య 1954 లో పంచశీల ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు తలదూర్చకూడదు. ఒకరి సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించాలి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇరుదేశాల ప్రయోజనాల కోసం ఒకరికొకరు సహకరించుకోవాలి అనేవి పంచశీల ఒప్పందంలోని అంశాలు. అయితే భారత్.. చైనాతో దాదాపు 3200 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖగా బ్రిటిష్ వారు నిర్ధారించిన మెక్ మోహన్ రేఖ ఉంది.
భారత్ లో దలదాచుకున్న దలైలామా
అయితే దీన్ని అధికారిక సరిహద్దుగా చైనా ఎప్పుడూ గుర్తించలేదు. జమ్మూ కాశ్మీర్ లోని ఆక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి వాటిని తన భూభాగాలేననేది చైనా వాదన. అంతేకాకుండా 1959లో ప్రత్యేక టిబెట్ కోసం ఉద్యమిస్తున్న బౌద్ధమత గురువు దలైలామాను భారత్ ఎగదోస్తుందని చైనా నమ్మింది. ప్రాణభయంతో భారత్ కు పారిపోయి వచ్చిన దలైలామాకు భారత్ ఆశ్రయమిచ్చింది. ఇలా వివిధ కారణాలతో చైనా సైన్యం 1962 అక్టోబర్ 20 హిమాలయాల్లోని సరిహద్దును దాటి 1000 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చింది. మరోవైపు ఇటు ఈశాన్య ప్రాంతంలోనూ చైనా సైన్యం భారత్ పై దాడికి దిగింది. 30,000 మందికి పైగా చైనా సైన్యం అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడితే.. మనవద్ద సమాధానం లేకపోయింది.
చైనాను గుడ్డిగా నమ్మిన ప్రధాని నెహ్రూ
స్వల్ప సంఖ్యలో ఉన్న భారత సైనికులు..వారిని ఎదుర్కోలేక పోయారు. వేలాది మంది విగతజీవులుగా మారారు. ఎంతోమంది గాయపడ్డారు. మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఈ విషయంలో చైనాను గుడ్డిగా నమ్మిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తగిన మూల్యం చెల్లించాడు. నాటి రక్షణ మంత్రి కృష్ణమీనన్ అసమర్థ నిర్వాహకం, నెహ్రూ పనికిమాలిన విదేశాంగ విధానం భారత్ ను ఘోర పరాజయం పాలు చేశాయి. మొదటి నుంచీ చైనాను అతిగా నమ్మవద్దని.. సరిహద్దుల్లో భారత సైన్యాన్ని పెంచాలని చెవినిల్లుకట్టుకుని పోరాడిన దివంగత ప్రియతమ నేత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట పెడచెవిన పెట్టారు. దాదాపు నెల రోజులు ఈ యుద్దం జరిగింది.
భారత్ చైనాకు వ్యతిరేకం కాదు
భారత్ లో ఎన్నో ప్రాంతాలను చైనా ఆక్రమించింది. ఈ సంఘటన నెహ్రూను చాలా బాధించింది. ఆయన మరణానికి దారితీసిన కారణాల్లో ఇది కూడా ఒకటని విశ్లేషకులు అంటుంటారు. అయితే భారత్ చైనాకు వ్యతిరేకం కాదు. భారత్ ఎప్పుడూ హద్దు మీరి ప్రవర్తించింది లేదు. ఆ మాటకొస్తే ఐక్యరాజ్యసమితి అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం విషయంలో లాబీయింగ్ చేసింది మనదేశమే. కానీ ఆసియా ఖండంలో తానే నెంబర్ వన్ గా ఉండాలనే చైనా దుందుడుకు దాయాది పాకిస్థాన్ కూడా తోడైయింది. దీంతో ఇరు దేశాల వైఖరి, భారత్ ఎదుగుదలను సహించలేకపోవడం, ప్రపంచ రాజకీయా ల్లో భారత్ క్రియాశీలక పాత్ర పోషించడం దానికి నచ్చడం లేదు. తనతో పాటే భారత్ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటం చూసి కుళ్లుకుంటోంది.
చైనా వస్తువులను బ్యాన్ చేయాలి
ఇదీలా ఉంటే చైనా ను ఇప్పటికి మనం గుడ్డిగానే నమ్ముతూ వస్తున్నాం. మరీ అందుకు మనమేం చేయాలన్న ప్రశ్న మీకు ఉత్పన్నం కావచ్చు. దీనికి మనం ఒకే ఒక పని చేయాలి. అది కూడా నీకు ఒక్క పైసా కూడా నష్టంలేని పని... ప్రతి చైనా దేశపు వస్తువులను కొనడం మానేయండి. ఎందుకో తెలుసా వాడు కొనే ప్రతీ ఆయుధం మన డబ్బులతోనే. అంతర్జాతీయ వ్యాపార నియమాల ప్రకారం మన దేశం ఆ దేశపు వస్తువుల్ని బ్యాన్ చేయకూడదు....కానీ ప్రజలు చెయ్యొచ్చు..! చదువుకోని వారికి ఇవి అన్నీ అర్ధం కావు, చదువుకున్న నీవు కూడా మౌనంగా ఉంటే మనకి మరణమే గతి...!!