మహానేత వైఎస్ కు జగన్, విజయమ్మ ఘన నివాళి..!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాంగా ఉన్న సమయంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి నేడు.  ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైయస్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిలు ఘన నివాళి అర్పించారు.

ఇక వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పులివెందులలో వైకాపా నేతలు ప్రత్యేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ను ప్రత్యేకంగా అలంకరించి, సందర్శనార్ధం వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసారు. ఇక కుటుంబసభ్యులంతా నివాళులు అర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.

 వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: