చైనా భూభాగం మొత్తం భరత్ గుప్పిట్లోనే: యు.ఎస్.జర్నల్




మహాభారత చరిత్రలో అర్జునుడు మొత్తం వనవాసకాలాన్ని రానున్న కురుక్షేత్ర యుద్ధములో శతృసేనావాహినిని అంత మొందించే అస్త్ర శస్త్రాల సమూపార్జనకే వినియోగించారు. కారణం తమ పాండవుల అస్థిత్వానికి తమ స్త్రీ మానాపహరణానికి పూనుకొన్ని కౌరవహతకులను మానవత్వం మరచిన నరరూప రాక్షసులను ఇంకేమాత్రమూ ఉపేక్షించరాదనే నిర్ణయంతోనే కాదా!




అలాగే ప్రతిక్షణం మనమీద మన భూభాగం మీద మన దేశం పరిసరాల మీదా, మన ఇరుగుపొరుగులపై కయ్యనికి కాలు దువ్వు తూ మన శత్రువులకు స్నేహహస్తం చాపుతూ మన ఉనికికే హానికలిగించే మన పొరుగు అతి పెద్ద శత్రురాజ్యం చైనా ఆగడాలను ఇంకేమాత్రమూ క్షమించే పరిస్థితుల్లో భారత్ లేదని భావిస్తూ ఉంది. మన సహనం మన అస్థిత్వానికే ప్రమాదం తెస్తుంటే చివరికి  ఉడత లాంటి పాకిస్థాన్ కూడా మనను చూసి తోక ఊపుతూనే ఉంది. కాలుదువ్వింది కూడా. ఇప్పుడు దాని వెనుకు న్నదీ చైనానే.  ఈ ఉడతను వదిలేసి ఆ డ్రాగన్ ను కొట్టటమే భారత్ లక్ష్యంగా మాదింది.  



చైనాను మొత్తంగా లక్ష్యం చేసుకునే వ్యవస్థలు 



పాకిస్థాన్‌ విషయంలో ఎక్కువగా అప్రమత్తంగా ఉండే భారత్ ఈసారి చైనాపై దృష్టి సారించిందా?  యుద్ధమంటూ జరిగితే చైనాను నాశనం చేయగల ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోందా? చైనాలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేయగలిగే అణ్వా యుధ క్షిపణులు ఇండియా వద్ద ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నారు అమెరికాకు చెందిన ప్రముఖ అణ్వా యుధ నిపుణులు "హన్స్ ఎం క్రిస్టెన్సన్, రాబర్డ్ ఎస్ నోరిస్" అనే ఇద్దరు అణ్వాయుధ శాస్త్రవెత్తలు నిపుణులు. 




నిన్న మొన్నటి వరకు పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్‌ చేసి దాని అంతుతేల్చగల సామర్థ్యం సముపార్జించుకునేందు కు దృష్టిపెట్టిన భారత్‌ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై వ్యూహాలను సిద్ధం చేస్తోందని వివరించారు ఇప్పుడు తన లక్ష్యా న్ని చైనా వరకు పొడిగించిందని, ప్రస్తుతం చైనా లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగల సామర్థ్యంకోసం తన వద్ద ఉన్న అణ్వా యుధాలను మరింత అత్యంతంగా ఆధునీకరిస్తుందని అంటూ అమెరికాలోని అణుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. జులై-ఆగస్టు నెలకోసం అమెరికాలో విడుదల చేసిన డిజిటల్‌ జర్నల్‌ లో "ఇండియన్ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌-2017" అనే పేరిట రాసిన కథనం ఇప్పుడు డ్రాగన్ కంట్రీ గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తూ ధారుణమైన గుబులు రేపుతోంది.



India is building a top-secret nuclear city to produce thermos nuclear weapons which would upgrade the country as a nuclear power and unsettle its two major neighbors - Pakistan and China ---A leading American foreign policy journal  


ఈ కథనంలో భారత అణ్వాయుధ సంపత్తి గురించి ప్రస్తావించారు. చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకునే క్షిపణుల తయారీకి భారత్ సిద్ధమవుతోందని పేర్కొన్నారు. సాధారణంగా పాకిస్థాన్‌పై దృష్టి సారించే ఇండియా ప్రస్తుతం భారత్ ప్రస్తుతం పాకిస్థాన్‌ను మాత్రమే ఎదుర్కొనే విధంగా ఉన్న తన సామర్ధ్యాన్ని చైనాతో తలపడాలన్న ఉద్దేశం తో తన ప్రణాలికను చైనాను ఎదుర్కొనటమే కాదు నామరూపాలు లేకుండా సమసింపజేసే స్థాయికి భారత్ ఆయుధ అస్త్ర శస్త్ర అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటుందని వివరించారు. భవిష్యత్‌లో చైనాతో ఏమైనా జరగొచ్చనే ఉద్దేశమే దీనికి మూలమని అందుకే అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటోందని, తమ వద్ద ఇప్పటికే పోగుపడి ఉన్న కీలక అణ్వాయుధాలను మరింత ఆధునీకరిస్తోందంటూ కూడా ఆ ఆర్టికల్‌ పేర్కొంది. 


Agni 6 (Agni VI) Why would India want to develop a 10,000 km Range ICBM?



ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్న ఏడు అణువ్యవస్థలను అయాధునికంగా నిర్వహిస్తోందని, దీనికి అదనంగా మరో నాలుగింటిని సిద్ధం చేసుకుంటుందంటూ కూడా ఆ జర్నల్‌ వెల్లడించింది. భారత్ వద్ద రెండు అణు యుద్ధ విమానాలు, నాలుగు భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, ఒకటి సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి వ్యవస్థలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ ఏడింటికి జతగా ఈ విషంగా మరో నాలుగు అణువ్యవస్థలను భారత్ అభివృద్ధి చేస్తోందని కథనంలో వివరించారు. మరో దశాబ్దకాలంలోనే ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.



అయితే వీటికి దక్షిణ భారత్‌లో ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి చైనాలోని ఏ ప్రాంతాన్న యినా టార్గెట్‌ చేయగల అణు క్షిపణులను భారత్‌ ఆధునీకరిస్తుందంటూ కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. భారత్‌ 600 కిలోల "వెపన్స్ గ్రేడ్‌ ప్లుటోనియం" ను రడీ చేస్తోందని, వీటిని 150 నుంచి 200 అణు వార్‌హెడ్‌లలో ఉపయోగించనున్నట్లు అంచనా వేస్తున్నామని వివరించారు. అయితే, పదార్థాలనన్నింటినీ ఇంకా అణుపదార్థాలుగా మార్చ లేదని కూడా ఆ కథనం తెలిపింది. 




అగ్ని-1 క్షిపణిని ఆధునికీకరించి అగ్ని-2ను తయారు చేసిన భారత్ దాని పరిధిని 2వేల కిలోమీటర్లకు పెంచిందని ఈ క్షిపణితో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చన్నారు. అగ్ని-4తో చైనా మొత్తాన్ని టార్గెట్ చేయగల సత్తాను భారత్ సొంతం చేసుకుందని వారు నిపుణులు పేర్కొన్నారు.


"Indian nuclear forces, 2017" 

Hans M. KristensenRobert S. Norris

kristensen.jpg

HANS M. KRISTENSEN

Kristensen is the director of the Nuclear Information Project with the Federation of American Scientists (FAS) in Washington, DC. His work focuses on researching and writing about the status of...

Robert S. Norris

ROBERT S. NORRIS

Norris is a senior fellow with the Federation of American Scientists in Washington, DC. A former senior research...


India continues to modernize its nuclear arsenal, with at least four new weapon systems now under development to complement or replace existing nuclear-capable aircraft, land-based delivery systems, and sea-based systems. India is estimated to have produced enough plutonium for 150–200 nuclear warheads but has likely produced only 120–130. Nonetheless, additional plutonium will be required to produce warheads for missiles now under development, and India is reportedly building two new plutonium production facilities. India’s nuclear strategy, which has traditionally focused on Pakistan, now appears to place increased emphasis on China. 



దీనిని ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ప్రయోగించ వచ్చని వివరించారు. ఇక భారత్ అభివృద్ధి చేస్తున్న అగ్ని-5 ను దక్షిణాది నుంచి ప్రయోగించినా చైనా మొత్తం టార్గెట్‌గా మారుతుందని అమెరికా నిపుణులు పేర్కొన్నారు. అంతే కాదు భారత్ పాకిస్తాన్ టార్గెట్ చేయవలసిన పనిలేకపోవచ్చునని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: