ప్రత్యేకం: రాజ్యాంగ వ్యవస్థలు ఒక కుల వర్గానికే దాస్యం చేసే దరిద్రం తెలుగుజాతికి ఎందుకు?
కులపిచ్చి చట్రంలో న్యాయవ్యవస్థ అవస్థ: జస్టిస్ వి. ఈశ్వరయ్య
తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు తీవ్రమైన కులపిచ్చి ఉందని ఆరోపించారు రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య. బాబుకు కులపిచ్చి అని, ఈ పిచ్చితో ఆయన కీలకమైన న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆ రిటైర్డ్ న్యాయమూర్తి అంటున్నారు. బాబు కులపిచ్చితో చేసిన కొన్ని పనులను కూడా ఈయన సాక్ష్యాధారాలతో బయటపెట్టారు.
హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో చంద్రబాబు నాయుడు కులపిచ్చితో వ్యవహరించాడు అని ఈ రిటైర్డ్ జడ్జి అంటున్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను కూడా ప్రస్తావించారు ఆయన. హై కోర్టు జడ్జిల నియామకం విషయంలో ఇతర కులస్తులు అయిన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర న్యాయశాఖకు నివేదిక ఇచ్చాడని, తప్పుడు ఆరోపణలతో లేఖ రాశాడు అని ఈ రిటైర్డ్ జడ్జి ఆరోపించాడు.
కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన న్యాయమూర్తులను పక్కన పెట్టి, మిగతా వాళ్లెవరినీ హైకోర్టు జడ్జిలుగా నియమించకూడదని బాబు కుట్ర చేశాడని, అలాంటి ఉద్దేశంతో లేఖలు రాశాడని ఆయన అన్నారు. బాబు కులపిచ్చికి ఇది నిదర్శనమని ఆయన వ్యాక్యానించారు.
కీలకమైన హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో చంద్రబాబు ఇలా వ్యవహరించడంపట్ల ఆయన ధ్వజమెత్తారు. బాబు తీరుపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే తెలుగుదేశం హయాంలో ప్రబలిన కులపిచ్చి ఆరోపణలకు ఈ రిటైర్డ్ జడ్జి ఆరోపణలు మరింత ఊతం ఇస్తున్నట్టుగా ఉన్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Telugu
-
Andhra Pradesh
-
Manam
-
media
-
CBN
-
Chief Minister
-
Party
-
High court
-
Letter
-
Nara Chandra Babu Naidu
-
Backward Classes
-
Amaravati
-
Amaravathi
-
Capital
-
Janasena
-
Janasena Party
-
Pawan Kalyan
-
nageshwara rao akkineni
-
Thummala Nageswara Rao
-
Akkineni Nageswara Rao
-
court
-
central government
-
Kamma
-
Telugu Desam Party