జగన్ సీఎం కావడానికి ఇంతకంటే కారణం ఏముంటుంది….!

KSK
వైసీపీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న పాదయాత్ర కి ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా జగన్ తన పాదయాత్రలో పశ్చిమ వాసులను పలకరించే విధానం మరియు వారి చెబుతున్న సమస్యలను వింటూ ఓపికగా ముందుకు సాగుతూ వెళ్తున్న విధానం అక్కడ ఉన్న ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ క్రమంలో చాలామంది పచ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజలు...ఇతడు తన తండ్రిని మించిన పాలన చేస్తాడు అని జోస్యం చెపుతున్నారు. ఇదిలా ఉండగా జగన్ తన పాదయాత్రలో ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ప్రభుత్వ అరాచకాలను మోసాలను ప్రజలకు వివరిస్తూ పాలకుడు అంటే ఎలా ఉండాలో తెలియజేస్తూ వైసిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా ముందే చెబుతూ ప్రజలలో ధైర్యం నింపుతున్నారు.

ఇటీవల జగన్ పాదయాత్రలో తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న ఒక ఊరి రైతులతో మమేకమయ్యారు ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న పనిలో జగన్ కూడా ఒక చెయ్యి వేసి అనంతరం, తలపాగా చుట్టుకుని, చాటలో ధాన్యాన్ని ఆయన తూర్పారబట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలుగా అదుకున్నారని.. రైతన్నల జీవితాలలో మళ్ళీ వెలుగులు రావాలంటే అయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి కావాలి.. మేము జగన్ మోహన్ రెడ్డి ని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని అక్కడున్న  రైతులు తెలిపారు.గత ఎన్నికలలో మమ్మల్ని వెన్నుపోటుపొడిచి అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఈసారి ఎన్నికలలో ఇంటికి పంపించేస్తామని చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు రైతులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: