ప్రపంచంలో నిత్యం వివాదాలకు కేంద్రంగా నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటే చాలా వరకు వ్యతిరేక పవనాలే వీస్తుంటాయి. అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణలోని ఓ యువకుడికి దైవంగా మారారు. సంవత్సరకాలంగా ఆ యువకుడు ట్రంప్ ఫొటోకు నిత్య పూజలు, అభిషేకాలు చేస్తున్నాడు. ఓసారి రక్తాభిషేకం కూడా చేశాడు. భారత్ ,అమెరికా దేశాల మధ్య సంబధాలు మరింత మెరుగుపడాలని భావించిన అతడు గత ఏడాది కాలంగా ట్రంప్కు పూజలు చేస్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ తనను కలుస్తానని సందేశం పంపడంతో ఆ యువకుడి ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా సావిత్రి, రాములు దంపతుల కొడుకు కృష్ట. ట్రంప్కు వీరాభిమాని, గతేడాది దీపావళి నాడు నుంచి తన ఇంట్లో ట్రంప్ చిత్రపటానికి పూజలు చేయడం ప్రారంభించాడు.
స్తోత్రాలు పఠిస్తూ, హారతి ఇస్తూ నిత్యపూజలు చేస్తున్నాడు. ఓసారి చేతి వేలికి గాయం చేసుకుని ఫొటోకు రక్తాభిషేకం కూడా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ స్వయంగా ట్విటర్ ద్వారా తన సందేశం పంపించాడు.‘వంద కోట్ల భారతీయులలో క్రిష్ నా ప్రాణస్నేహితుడు… క్రిష్ నా అభిమాని. అతను నా ఫోటోల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్ను త్వరలోనే కలుస్తానంటూ’ ట్రంప్ ట్వీట్ చేయడం విశేషంగా మారింది. ఆ ట్వీట్ నిజంగానే ట్రంప్ చేశాడా లేకపోతే ఫేక్ అకౌంట్తో చేశారా అన్నదానిపై స్పష్టత లేదు.