డబ్బు సంపాదించడమే పరమావధిగా కొంత మంది అడ్డదార్లు తొక్కుతున్నారు. గ్రామాల నుంచి కొంత మంది యువతులను రప్పించి మసాజ్ సెంటర్లు, అపార్ట్ మెంట్స్ అద్దెకు తీసుకొని గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో హైటెక్ వ్యభిచారంలో సినీతారలు, టీవి ఆర్టిస్ట్ లు కూడా అడ్డంగా బుక్ అయిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీలో లగ్జరీగా బతకడానికి డబ్బు సంపాదించే క్రమంలో హైటె వ్యభిచారం కొనసాగిస్తున్నారు. కొంత మంది అమ్మాయిల బలహీనతలు క్యాష్ చేసుకొని వారిని ఆటబొమ్మల్లా వాడుకుంటున్నారు.
రేవ్ పార్టీలు, పబ్ కల్చర్ నగరంలోని కొంత మంది దళారు డబ్బు సంపాదించడానికి యువతను టార్గెట్ చేస్తున్నారు. ఓ బడా హోటల్పై దాడి చేసిన పోలీసులు అమ్మాయిలతో చిందులేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గతరాత్రి భవానీపురం ఆలీవ్ట్రీ హోటల్లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని సమచారం అందుకున్న పోలీసులు హోటల్ దాడి చేశారు.
మందు తాగుతూ అమ్మాయిలతో కలిసి చిందులు వేస్తున్న 53 మందిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరానికి చెందిన నలుగురు, హైదరాబాద్కు చెందిన ఒకరు, విజయవాడకు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం వీరిపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.