పవన్ కళ్యాణ్ కొత్త అవతారం... ఎన్ని కోట్లు...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ కోట్ల కొద్దీ ఆదాయం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తోనే వచ్చానని, సినిమా లమీద నాకు ఇంకా ఆసక్తి లేదని చాలా సార్లు చెప్పినాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒక షో  హోస్ట్ గా  వ్యవహరించనున్నాడని తెలుస్తుంది. చాలా మంది హీరోలు ఇప్పటికే టీవీ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ అంటే కాకినాడకు చెందిన వ్యాపారవేత్త. ఆంధ్రప్రభ దినపత్రిక యజమాని కూడా.


మరోరకంగా ఆయన వైఎస్సార్ సీపీ నాయకుడు కూడా. ఆయన కుమారుడు శశిధర్ కాకినాడ వైకాపా రాజకీయాల్లో మొన్నమొన్నటి దాకా చాలా కీలకంగానే ఉన్నారు. ఆంధప్రభ దినపత్రిక వ్యవహారాలు చూస్తున్న ఆయన చిన్నకొడుకు గౌతమ్ త్వరలోనే ఇండియా ఎహెడ్ అనే ఇంగ్లిషు న్యూస్ ఛానెల్ ను ప్రారంభిస్తున్నారట. అందులో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా చేయాలని పవన్ ను అడగగా, ఆయన ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ముత్తా గోపాలకృష్ణ అండ్ సన్స్ ప్రస్తుతం ఉన్న వైకాపా నుంచి జనసేనలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా వారికి అక్కడ పెద్ద బలంలేకపోయినా.. పవన్ పంచన చేరుతున్నారనే మాట వినవస్తోంది. పార్టీలో చేరికలకు తోడుగా.. టీవీ కార్యక్రమానికి హోస్ట్ గా చేయడానికి పవన్ కల్యాణ్ చాలా పెద్ద మొత్తంలోనే డీల్ మాట్లాడుకుని ఉంటానే పుకారు కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: