తెలంగాణ సర్కార్ కి కేంద్రం షాక్!

Edari Rama Krishna
ఈ మద్య తెలంగాణ ప్రభుత్వంపై చిన్న చూపు చూస్తున్నారని పదే పదే ఆరోపిస్తున్న సమయంలో కేంద్రం మరో షాక్ ఇచ్చింది. తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో మద్దతు ఇచ్చిన రోజే తెలంగాణకు కేంద్రం షాక్ ఇచ్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.  కాగా కొంత కాలంగా తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెపడుతున్న విషయం తెలిసిందే.

కాళేశ్వరం, పాలమూరుకు రెండింట్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలన్న ఎంపీ వినోద్ లేఖకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఉండదని తేల్చి చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: