సందేహమే అవసరం లేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పోయిన ఎన్నికల్లో దూరమైన ఓటు బ్యాంకును దగ్గరకు తీసుకునేందుకు చంద్రబాబునాయుడు పెద్ద వలే విసురుతున్నారు. ' నారా హమారా పేరుతో చంద్రబాబు పెద్ద కార్యక్రమమే నిర్వహిస్తున్నారు. ఈనెల 28వ తేదీన గుంటూరు జిల్లాలోని మాచర్లలో ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఓట్ల కోసం కొత్త డ్రామా
ముస్లింల సంక్షేమానికి కట్టుబడున్న ఏకైక పార్టీ, ముస్లింల క్షేమాన్ని కోరే ఏకైక నేత తానే అని ముస్లిం పెద్దలతో రాష్ట్రమంతటా డప్పు కొట్టిచుక్కోవటమే చంద్రబాబు లక్ష్యం. అందుకనే నారా హమారా కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేస్తున్నట్లు సమాచారం. గతంలో తాను ముస్లింల అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడిందనే విషయమై చంద్రబాబు ఎటూ ఊదరగొడతారు. అంటే ఈ దఫా చేసిందేమీ లేకపోగా నాలుగేళ్ళు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు
ముస్లింలను చంద్రబాబు ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే మంత్రివర్గంలో ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అంటే పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన ముస్లింల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవ లేదు లేండి. అందుకనే వైసిపి నుండి గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కున్నారు. పోనీ వారిలో ఎవరికైనా మంత్రిపదవి ఇచ్చారా అంటే అదీ లేదు. బిజెపితో కటీఫ్ చెప్పటం, త్వరలో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో హటాత్తుగా చంద్రబాబుకు ఇపుడు ముస్లింలు గుర్తుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింల ఓట్లు కొల్లగొట్టే ఉద్దేశ్యంతోనే నారా హమారా అంటూ హడావుడి మొదలుపెట్టారు.