అసెంబ్లీ రద్ధు - 105మంది అభ్యర్ధుల ప్రకటన - కెసిఆర్ ఎన్నికల మానిఫెస్టో కమిటీ
హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాద సభ తో రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. శాసనసభ ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
కాంగ్రెస్, టీడీపీ పొత్తు విషయమై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ఆ మాట అనడానికి సిగ్గు ఉండాలి. తెలంగాణ మళ్లీ ఆంధ్రా పార్టీలకు గులాం గిరీ చేయొద్దు. తెలంగాణ వాళ్లే శాసన కర్తలుగా ఉండాలి. ఆంధ్రా పార్టీలతో పొత్తు ఏంటి?’ అని ఆయన నిలదీశారు. ‘ఎన్టీఆర్ కంటే మొగోడా కేసీఆర్ అన్నారు. కావొద్దా..? చెన్నారెడ్డి కంటే మొగోడా అన్నారు. తెలంగాణ తేవడంలో చెన్నారెడ్డి విఫలమైతే.. నేను సాధించాను’ అని కేసీఆర్ తెలిపారు.
అసదుద్దీన్ ఓవైసీ తనంతట తానుగా నాకు ఢిల్లీలోనే ఫోన్ చేసి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ, కలిసి పని చేస్తున్నాం. స్నేహపూర్వకంగా పోటీ ఉండొచ్చు. మేం సెక్యులర్ పార్టీ. మజ్లిస్తో కలిసి ఉండే టీఆర్ఎస్తో స్నేహం ఉండదని బీజేపీ అధ్యక్షుడే చెప్పార’న కేసీఆర్ తెలిపారు.
బీజేపీకి దగ్గరవుతున్నామని ప్రచారం చేస్తున్నారు. ప్రధానితో మాట్లాడటం తప్పా? నాకు ఆయనతో చాలా అవసరాలుంటాయి. ప్రధాని మోదీతో నాకుంది ప్రభుత్వమైన అనుబంధమే.
శుక్రవారం హుస్నాబాద్లో జరిగే ప్రజల ఆశీర్వాద సభ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలను వివరిస్తూనే.. తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో కూడా చెప్పబోతున్నారు. ఈ మేరకు మేనిఫెస్టో సిద్ధం చేసేందుకు కమిటీని కూడా నియమించారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు ఛైర్మన్గా 15 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో పార్టీ సీనియర్లు, ఎంపీలకు స్థానం కల్పించారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
media
-
Assembly
-
Cabinet
-
Telangana
-
Chief Minister
-
MLA
-
Medak
-
babu mohan
-
local language
-
chanti
-
kiran
-
kranthi
-
kranti
-
Telangana Rashtra Samithi TRS
-
MP
-
suman
-
KCR
-
Warangal
-
Elections
-
Aqua
-
pragathi
-
Party
-
rahul new
-
rahul
-
K L Rahul
-
Rahul Sipligunj
-
Congress
-
TDP
-
Smart phone
-
Bharatiya Janata Party
-
Prime Minister
-
Rajya Sabha
-
K Keshava Rao
-
Minister
-
CM