సాధారణంగా ఆకాశంలో అప్పుడప్పుడు వింత వింత ఆకారాలు గోచరిస్తుంటాయి..వాటిలో మనుషులు, జంతువులు..ఇలా చిత్ర విచిత్రంమైన ఆకారాలు కనిపిస్తుంటాయి..వాటిని ఫోటోలు తీసి అకాశంలో నేడు వింత ఆకారం కంట పడిందని వార్తలు వస్తుంటాయి. తాజాగా ఇప్పుడు చందమామలో బాబా రూపం.. ఇప్పుడి ఇది హాట్టాపిక్గా మారింది. సాక్షాత్తు శిరిడీ సాయిబాబానే చందమామలో కనిపిస్తున్నాడంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటీ చందమామలో షిరిడీ సాయి ప్రత్యక్షం కావడం ఏంటీ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు హేతువాదులు అబ్బే ఇదంతా కావాలని ఎవరో చేస్తున్న పుకార్లు అంటూ కొట్టి పడేస్తున్నారు.
ఇంతకీ, ఆ దృశ్యం ఎవరిది..?సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ ఫోటో గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే..పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వాసులు ఈ వింత చూడటానికి రోడ్లపైకి వచ్చారు. రాత్రంతా ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో షూట్ చేసుకున్నారు. చందమామలో కనిపిస్తున్నది నిజంగా బాబా ఆకారమేనని అందరూ విశ్వసిస్తున్నారు.
ఇన్నేళ్లలో ఇలాంటి వింతను తామెప్పుడూ చూడలేదని ఇది కచ్చితంగా బాబా మహత్యమేనంటూ చందమామకు నమస్కారాలు పెడుతూ ఇదే సమాచారాన్ని బంధువులకు కూడా చేరవేశారు. కాగా, గత నెల గురు పౌర్ణమి ఇలాంటి దృశ్యం కనిపించిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గణేషుడిని నవరాత్రులు చివరి రోజు కావడంతో నిండు పౌర్ణమి రోజు కూడా ఇటువంటి చిత్రం చందమామలో కనిపిస్తుండటంతో భక్తులు ఆనందపడుతున్న సమయంలో వైపు ఇదంతా ఒట్టిదేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో మార్ఫింగ్ అంటూ కొట్టిపారేస్తున్నారు.